రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు సహా ఇద్దరు మృతి | bridegroom,1 other dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు సహా ఇద్దరు మృతి

Apr 7 2015 7:27 AM | Updated on Aug 30 2018 3:56 PM

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న నవ వధువరుల బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై పెళ్లికుమారుడు మరణించిన విషాద సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

వైఎస్ఆర్ జిల్లా: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న నవ వధువరుల బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై పెళ్లికుమారుడు మరణించిన విషాద సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్(27)కు అదే మండలానికి చెందిన లక్ష్మిస్వాతి(19)తో సోమవారం ఉదయం వివాహమైంది. వివాహానంతరం స్వామివారి ఆశిస్సుల కోసం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్న వాళ్లు తూఫాన్ వాహనంలో సోమవారం రాత్రి బయలుదేరారు.

 

వాహనం మంగళవారం తెల్లవారుజామున కాజీపేట మండలం చెన్నముక్కపల్లె సమీపంలో రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తూఫాన్‌లో ప్రయాణిస్తున్న పెళ్లి కొడుకు వెంకట ప్రసాద్‌తో పాటు అతని బంధువు నర్సమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందారు. వాహనంలో ఉన్న మిగతా పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 సహయంతో కర్నూలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పెళ్లి కూతురు లక్ష్మిస్వాతితో పాటు మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement