ప్రత్యేక హోదా కోసం రక్తదాన శిబిరం

Blood Donation Camp For AP Special Status - Sakshi

సాక్షి, విశాఖ : ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రకు ఆర్థిక ప్యాకేజీతో పాటు విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో విశాఖ కేజీహెచ్‌లో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. చర్చా వేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ  రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర హక్కుల కోసం రాజకీయ పార్టీలన్నీ తమ జెండాలను పక్కన పెట్టి పోరాడినప్పుడే కేంద్రం దిగివస్తుందన్నారు. బీజేపీకి చెందిన పార్లమెంట్‌ సభ్యులు, శాసన సభ్యులు రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top