వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి
కంకిపాడు : అమరావతి రాజధాని నిర్మాణమా? లేక భ్రమరావతి నిర్మాణమా? ప్రత్యేక హోదా సంజీవనా, కాదా? ప్రజలకు తేల్చి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు ప్రధాన సెంటరులో కొవ్వొత్తులు, దీపాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పుష్కర ప్రచారం, రాజధాని నిర్మాణం ప్రచారం పేరుతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఓ వైపు నిధులు లేవంటూ సంక్షేమ పథకాల అమలులో కోత విధిస్తున్న ప్రభుత్వం నిధులు ఎందుకు దుర్వినియోగం చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో అమాయక రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజధాని శంకుస్థాపన సభలో పీఎం మోదీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని హితవుపలికారు.
బద్ధ శత్రువులు కలిశారు..
రాజధాని నిర్మాణం వంకతో నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్లు కలిసిపోయారని సారథి వ్యాఖ్యానించారు. రైతులు సాగునీటికి ఇబ్బందులు పడ్డా, విద్యార్థులు తెలంగాణ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అవస్థలు పడ్డా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. టీ ప్రభుత్వంతో చర్చిం చేందుకు చొరవ చూపలేదన్నారు. రాజధాని పేరుతో ఏకాంత చర్చలు జరపటంలో ఆంతర్యం ఏమిటో వివరించాలన్నారు.
అమరావతా.. భ్రమరావతి నిర్మాణమా?
Published Wed, Oct 21 2015 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement