రిలయన్స్ ఇండస్ట్రీ లాజిస్టిక్ గెస్ట్ హౌస్ పై దాడి | Sakshi
Sakshi News home page

రిలయన్స్ ఇండస్ట్రీ లాజిస్టిక్ గెస్ట్ హౌస్ పై దాడి

Published Tue, Jul 12 2016 10:04 AM

attack on Reliance industries logistic H goswamy guest house

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రిలయన్స్ ఇండస్ట్రీ లాజిస్టిక్ హెచ్.గోస్వామి గెస్ట్ హౌస్ పై కొందరు గుర్తుతెలియిన దుండగులు దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి వాచ్ మెన్ పై దాడి చేశారు. అనంతరం వాచ్ మెన్ ను కట్టేసి తలుపులు పగలగొట్టి అందులోకి చొరబడ్డారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement