కార్పొరేషన్లకు సభ్యుల నియామకం

Appointment Of Members To Corporations - Sakshi

అమరావతి: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.  ఒక్కో కార్పొరేషన్‌కు నాలుగు నుంచి ఆరుగురు వరకు సభ్యులను నియమించారు. ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఏపీ స్టేట్‌ ఇర్రిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌,  ఏపీ గ్రంధాలయ సంస్థ, ఏపీ షీప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్లకు సభ్యులను కేటాయించారు. ఎన్నికలు దగ్గర సమయంలో టీడీపీలో అసంతృప్తులను చల్లబరిచేందుకు కార్పొరేషన్ల నియామకం చేపడుతోన్నట్లు కనిపిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top