చంద్రబాబును కలిసిన ఏపీఎన్జీవోలు | APNGOs meet Chandrababu naidu for united state | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన ఏపీఎన్జీవోలు

Aug 5 2013 6:43 PM | Updated on Aug 10 2018 7:58 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఏపీఎన్జీవోలు సోమవారం సమావేశమైయ్యారు.

హైదరాబాద్: టీడీ పీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఏపీఎన్జీవోలు సోమవారం సమావేశమైయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ఉద్యోగులు, యువత తీవ్రంగా నష్ట పోతారని  విన్నవించినట్లు తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలంటే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో కొత్తేమి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన ముందు నుంచి చెబుతున్న మాట ఇదేనని ఏపీ ఎన్జీవోలు తెలిపారు. సమైక్యాంధ్రా కోసం తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.

 

.ఏపీఎన్జీవోలు మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.  సీమాంధ్రాలో ఉన్న  ప్రజా ప్రతినిధులు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు సమర్పించాలని వారు  హెచ్చరించారు. మంత్రులు రాజీనామాలను సమర్పించాలని, లేకుంటే  రాష్ట్రంలో పాలన స్తంభింపజేస్తామని  తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు రాజీనామా లేఖలను పమర్పించాలని  ఏపీఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement