ఏపీ లాసెట్‌-2017 నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ లాసెట్‌-2017 నోటిఫికేషన్‌ విడుదల - Sakshi


అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లాసెట్‌–2017 నోటిఫికేషన్‌ విడుదలయింది. మూడేళ్లు-ఐదేళ‍్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.



దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 18. అపరాధ రుసుము రూ.500తో మార్చి 27 వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 5 వరకు, రూ.1500తో ఏప్రిల్‌ 14 వరకు, రూ.5 వేలతో ఏప్రిల్‌ 17 (సాయంత్రం 5 గంటల వరకు) వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్ష ఫీజు రూ.700, ఎల్‌ఎల్‌ఎంకు రూ.800గా నిర్ధారించారు. హాల్‌టికెట్లు ఏప్రిల్‌ 14 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 19న రాత పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top