
సాక్షి, అమరావతి : వినాయక చవితి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరించదన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులంతా ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ శుభ దినాన భక్తుల సమస్యలు తొలగిపోయి వారి ప్రయత్నాలు విజయవంతం అయ్యేలా వినాయకుడు ఆశీర్వదించాలని ఆకాంక్షినట్లు తెలిపారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలతో జీవించేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్ ప్రకటించారు.