రాజధాని భూములు 99 ఏళ్లపాటు సింగపూర్కు! | ap government is planing to give capital lands to singapore: ysrcp rk | Sakshi
Sakshi News home page

రాజధాని భూములు 99 ఏళ్లపాటు సింగపూర్కు!

Dec 21 2015 1:39 PM | Updated on Aug 18 2018 8:05 PM

ఏపీ రాజధాని భూములను ప్రభుత్వం సింగపూర్ కు దోచిపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణ అన్నారు. సింగపూర్ కు 99 ఏళ్లు భూములు కట్టబెట్టేందుకు కుట్ర జరిగిందని అన్నారు.

గుంటూరు: ఏపీ రాజధాని భూములను ప్రభుత్వం సింగపూర్ కు దోచిపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణ అన్నారు. సింగపూర్ కు 99 ఏళ్లు భూములు కట్టబెట్టేందుకు కుట్ర జరిగిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కోసం మళ్లీ భూములు సేకరించడం దారుణం అని అన్నారు. సింగపూర్ శాటిలైట్లను ఇస్రో నుంచి పంపిస్తుంటే చంద్రబాబునాయుడు మాత్రం సింగపూర్ చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement