పతాకావిష్కరణకు మంత్రులు ఓకే | Andhra Pradesh ministers say ok to flag hoisting | Sakshi
Sakshi News home page

పతాకావిష్కరణకు మంత్రులు ఓకే

Aug 14 2013 2:52 AM | Updated on Jun 2 2018 4:00 PM

స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు మంత్రులు అంగీకరించారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు మంత్రులు అంగీకరించారు. రాజీనామాలను ఆమోదించనందున పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనాలన్న సీఎం కిరణ్ సూచనకు మంత్రులు అంగీకరించారు. జిల్లాల వారీగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్- గీతారెడ్డి, నిజామాబాద్- పి.సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్- డి. శ్రీధర్‌బాబు, రంగారెడ్డి- జి.ప్రసాద్‌కుమార్, మహబూబ్‌నగర్- డి.కె.అరుణ, నల్లగొండ- కె.జానారెడ్డి, వరంగల్- పొన్నాల లక్ష్మయ్య, ఖమ్మం-రామిరెడ్డి వెంకటరెడ్డి, విజయనగరం-శత్రుచర్ల విజయరామరాజు, శ్రీకాకుళం -కొండ్రు మురళి, విశాఖపట్టణం-పి.బాలరాజు, తూర్పుగోదావరి -పి.విశ్వరూప్, పశ్చిమగోదావరి-వట్టి వసంతకుమార్, కృష్ణా -కె. పార్థసారథి, గుంటూరు -కన్నా లక్ష్మీనారాయణ, ప్రకాశం-ఎం.మహీధర్‌రెడ్డి, నెల్లూరు- ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్‌ఆర్- అహ్మదుల్లా, కర్నూలు-టి.జి.వెంకటేశ్, అనంతపురం- ఎన్.రఘువీరారెడ్డి, చిత్తూరు-గల్లా అరుణకుమారి, ఆదిలాబాద్-బసవరాజు సారయ్య.
 
 మంత్రి పదవికి రామచంద్రయ్య రాజీనామా
 దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎంకు మంగళవారం రాజీనామా లేఖను పంపించారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement