-
ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయం, ఏపీ సచివాలయం, మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, ఆర్టీసీ హౌస్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన: మోషేన్రాజు, తమ్మినేని రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగడం చాలా సంతోషంగా ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో వారిద్దరూ జాతీయ జెండాలను ఎగురవేశారు. మోషేన్రాజు, తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నేడు పరిపాలన ఇంత సాఫీగా సాగుతోందంటే అందుకు రాజ్యాంగమే కారణమన్నారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు, ఉప కార్యదర్శులు సుబ్బరాజు, విజయరాజు, చీఫ్ మార్షల్ డి.ఏడుకొండలరెడ్డి, లీగల్ అడ్వైజర్ ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం: సీఎస్ సమాజంలోని అందరం కలిసి బాధ్యతతో మెలుగుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. సచివాలయ ముఖ్య భద్రతాధికారి కె.కృష్ణమూర్తి, జీఏడీ ఉప కార్యదర్శి రామసుబ్బయ్య, శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో... తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ భవన్లో... విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 24 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బహ్మానందరెడ్డి, కోటేశ్వరరావుతోపాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ సౌధలో... విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె.విజయానంద్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏపీ ట్రాన్స్కో మాజీ (థర్మల్) జి.విజయకుమార్కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. విద్యుత్ సౌధ వద్ద నిర్మించిన 100 కిలోవాట్ల సోలార్ పార్కింగ్ను విజయానంద్ ప్రారంభించారు. ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, చీఫ్ ఆఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ టి.పనాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఏపీ భవన్లో గణతంత్ర వేడుక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఏపీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ పాల్గొన్నారు. హెచ్ఆర్సీ కార్యాలయంలో... కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో హెచ్ఆర్సీ చైర్మన్ సీతారామమూర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. లోకాయుక్తలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ నరసింహారెడ్డి, డిప్యూటీ రిజి్రస్టార్ పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకం రిపబ్లిక్డే వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ సాక్షి, అమరావతి: రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ తెలిపారు. హైకోర్టులో శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవానికి జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల కారణంగా ప్రజలకు న్యాయ సేవలను, సత్వర న్యాయాన్ని అందించడం సవాళ్లతో కూడుకున్న పని అని అన్నారు. సవాళ్లను అధిగమించి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పేదరికం, అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని వర్గాలకు న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయాన్ని పేదల ముంగిటకు తీసుకువెళ్లేందుకు న్యాయసేవాధికార సంస్థ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. మన న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 8,960 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ప్రజలకు అవగాహన కలిగించిందని వివరించారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం న్యాయమూర్తులు హైకోర్టు వద్ద మొక్కలు నాటారు. -
స్వాతంత్య్ర దిన వేడుకలు.. సామాన్యులే అతిథులు
న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దిన వేడుకలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టున ఢిల్లీలోని ఎర్రకోటలో అంబరాన్నంటే సంబరాల్లో సామాన్యుడికి పెద్దపీట వేసింది. దేశానికి వెన్నుముకలాంటి రైతులు, చెమటోడ్చి పని చేసే కార్మికులు, జీవనోపాధి కోసం ప్రాణాలనే పణంగా పెట్టే జాలర్లు, సేవాగుణం కలిగిన నర్సులు, గ్రామాల సర్పంచ్లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఢిల్లీలో ఎర్రకోటపై మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 2047 స్వాతంత్య్ర దిన శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆజాదీకా అమృతోత్సవ్లో భాగంగానే స్వాతంత్య్ర దిన వేడుకల్ని జరుపుతున్నారు. ఇక ఇంటింటిలోనూ త్రివర్ణ పతాకం ఎగరాలన్న ప్రచారం ఆదివారం నుంచే మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను డిస్ప్లే పిక్చర్ (డీపీ) గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. చైతన్యవంత గ్రామాల నుంచీ.. స్వాతంత్ర దిన వేడుకలకు ప్రత్యేకంగా 1,800 మంది అతిథుల్ని ఆహ్వానించారు. దేశంలోని అత్యంత చైతన్యవంతమైన గ్రామాలుగా గుర్తింపు పొందిన 660కి పైగా గ్రామాల నుంచి 400 మందికి పైగా సర్పంచ్లు, 250 మంది రైతులు, పార్లమెంటు కొత్త భవనం, సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంలో భాగస్వామ్యులైన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ పనివారుతో పాటు జాలర్లు, టీచర్లు, నర్సులు ఇలా సమాజంలో కీలకమైన వర్గాల వారందరికీ ఆహ్వానం పలికినట్టుగా కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సతీ సమేతంగా హాజరయ్యే ఈ అతిథులకి బస ఏర్పాట్లు చేస్తోంది. సెల్ఫీ పాయింట్లు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా యువతీయువకులకు సెల్ఫీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందు కోసం 12 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను వివిధ థీమ్లతో తీర్చి దిద్దింది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ఘాట్, జమా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్,, ఇలా 12 ప్రాంతాల్లో పెట్టిన సెల్ఫీ పాయింట్లలో సెల్ఫీలు తీసుకొని ఆగస్టు 15–20 మధ్య మైగవ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఒక్కో సెల్ఫీ పాయింట్ నుంచి అత్యుత్తమమైన దానిని ఎంపిక చేసి 12 మంది విజేతలకు రూ.10 వేల చొప్పున బహుమానం అందిస్తారు. డీపీలుగా జాతీయ జెండా హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులందరూ తమ అకౌంట్లలో డీపీని జాతీయ జెండాతో మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ తన అకౌంట్లలో త్రివర్ణ పతాకాన్నే డీపీగా పెట్టుకున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇదో ఉద్యమంగా చేయాలన్నారు. దేశానికి, ప్రజలకి మధ్య ఉండే ఉద్వేగభరితమైన సంబంధానికి ప్రతీకగా జాతీయ జెండాను డీపీగా ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ జెండాలతో ఫోటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. -
Azadi Ka Amrit Mahotsav: అమృత్ సెల్యూట్
మువ్వన్నెల రెపరెపల నడుమ స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 76వ స్వాతంత్య్ర దినాతోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అమృతోత్సవాల్లో భాగంగా కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంద్రాగస్టు జోష్ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. హర్ ఘర్ తిరంగా పిలుపును ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో అందిపుచ్చుకున్నారు. దాంతో త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఇల్లూ పండుగ చేసుకుంటోంది. రెండేళ్లుగా కరోనా కల్లోలం మధ్యే పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. దాని పంజా నుంచి బయట పడుతుండటం ఈసారి పంద్రాగస్టు ఉత్సహాన్ని రెట్టింపు చేస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్ర సాఫల్యాలను ప్రస్తావించడంతో పాటు పలు కొత్త పథకాలు ప్రకటించడం మోదీకి ఆనవాయితీగా వస్తోంది. 2021 ప్రసంగంలో గతి శక్తి మాస్టర్ప్లాన్, నేషనల్ హైడ్రోజన్ మిషన్ వంటివాటిని ఆయన ప్రకటించారు. 2020లో దేశంలోని 6 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. త్రివిధ దళాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకాన్ని 2019లో ప్రకటించారు. ఆ క్రమంలో ఈసారి మోదీ ఆరోగ్య రంగానికి సంబంధించి హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా పేరిట కొత్త పథకాలు ప్రకటిస్తారంటున్నారు. ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేయడం, పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. రక్షణ వలయంలో ఢిల్లీ పంద్రాగస్టు నేపథ్యంలో కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి దాకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీలో శుక్రవారం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్ అమల్లో ఉంది. అడుగడుగునా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట వద్ద పతాకావిష్కరణ వేడుకకు 7,000 మందికి పైగా అతిథులు రానుండటంతో 10 వేల మంది భద్రతా సిబ్బంది కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. 2017లో మోదీ పంద్రాగస్టు ప్రసంగ సమయంలో ఓ పతంగి ఆయన ముందున్న పోడియంపై వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఈసారి వేడుక ముగిసేదాకా ఎర్రకోటకు 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో పతంగులు, బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలన్న పిలుపుల నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను మరింతగా పెంచారు. సరిహద్దుల వెంబడి సైన్యం, బీఎస్ఫ్ మరింత అప్రమత్తమయ్యాయి. – న్యూఢిల్లీ -
Azadi Ka Amrit Mahotsav: హర్ ఘర్ తిరంగా..మన ఇంటిపై మూడు రంగుల జెండా
గొప్ప సందర్భం దగ్గర పడింది. దేశమంతా పండగ కళ రానుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఊరూ వాడా వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి ‘ఇంటిని’ కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? ఉత్సవ సందర్భంగా ఏం చేస్తే బాగుంటుంది? పిల్లల చేత ఏం చేయిస్తే బాగుంటుంది. కొన్ని ఆలోచనలు. ఒక మహా దృశ్యాన్ని ఊహించండి. డ్రోన్ షాట్. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు డ్రోన్ కెమెరా ఎగురుతూ వుంటే ప్రతి ఇంటి మీదా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం. భారత ప్రజల సగర్వ స్ఫూర్తి. ఉప్పొంగే గుండెల దీప్తి. ఎలా ఉంటుంది? అద్భుతం కదూ. ఇప్పుడు ఆ ఊహ నిజం కాబోతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు దేశంలోని 20 కోట్ల ఇళ్ల మీద త్రివర్ణ పతాకం ఎగరాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగిన ప్రచారం కోసం, ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు హోం శాఖ సూచనలు చేసింది. మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయమై ప్రచారం చేయాలని తెలిపింది. పిల్లలు, యువత, వయోజనులు అందరూ కలిసి ఈ తేదీలకు ముందు బృందాలుగా ఏర్పడి త్రివర్ణ పతాకాలు చేబూని పల్లెల్లో తిరుగుతూ ‘ప్రభాత్ ఫేరి’ చేస్తే ప్రజలు స్పందిస్తారని చెప్పింది. గాంధీజీ 1930లలో దేశభక్తి ప్రేరేపించడానికి తెల్లవారుజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘ప్రభాత్ ఫేరి’ (ప్రభాత భ్రమణం) నిర్వహించేవారు. ఇప్పుడు ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగరాలంటే ఇలాంటి ప్రభాత భ్రమణాలు అవసరమని కేంద్రం తెలిపింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలతో సెల్ఫీలు పెట్టమని చెప్పింది. మొత్తంగా ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడాలని కోరింది. మూడు రోజుల పాటు 20 కోట్ల ఇళ్ల మీద జెండాలు ఎగరడానికి మూడు సైజులలో తయారీకి, అందుబాటుకు ఏర్పాట్లు చేసింది. ఇవి ఆన్లైన్లో, పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఇంటి పండగ అవును. ఇది ప్రతి ఇంటి పండగ. ఒక అపూర్వఘట్టంలో మన ఇంటి మీద జెండా ఎగరనున్న పండగ. పెద్దలకి, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు ఇంతకు మించిన జ్ఞాపకం ఏమైనా ఉంటుందా? ఒక త్రివర్ణ పతాకంతో మించిన ఫ్యామిలీ ఫొటో ఉంటుందా? అయితే ఈ ఘట్టంలో మనం ఏ మాత్రం యోగ్యతతో ఉన్నామో చెక్ చేసుకోవాలి. కొన్ని తప్పక చేయాలి. కొన్ని చేయమని ఇతరులకు చెప్పాలి. మన ఇంట్లో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చెక్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో గాంధీజీ ఆత్మ కథ ‘సత్యశోధన’ కనీసం ఉండాలి. నెహ్రూ రచనలు, భగత్ సింగ్ జీవిత కథ తెలుగు యోధులు అల్లూరి, ప్రకాశం పంతులు వంటి వారి పరిచయ పుస్తకాలు ఉండాలి. నలుగురిలో కలిసి ‘జనగణమన’ పాడటం కాదు. ఒక్కళ్లమే తప్పుల్లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా జాతీయ గీతం పాడటం ప్రాక్టీసు చేయాలి. ‘వందేమాతరం’ కంఠతా పట్టాలి. ‘రఘుపతి రాఘవ రాజారామ్’, ‘సారే జహాసే అచ్ఛా’ వంటి గీతాలు పిల్లల చేత కంఠతా పట్టించాలి. ఉంటున్న వీధుల్లో, అపార్ట్మెంట్లలో ఆగస్టు పదిహేను లోపు వీలున్న సమయాల్లో, శని, ఆదివారాల్లో పిల్లల చేత ఇవన్నీ ప్రాక్టీసు చేయించాలి. వారికి క్విజ్లు పెట్టాలి. ఈ మూడు రోజులు దేశ నాయకుల పోస్టర్లు ఇంట్లో అలంకరించాలి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సుభాస్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అబుల్ కలామ్ ఆజాద్... వంటి నేతల్లో ఎవరో ఒకరన్నా మన డ్రాయింగ్ రూమ్లో కొలువుదీరాలి. కమ్యూనిటీ ఉత్సవాలు జరుపుకోవాలి. అంటే వీధుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్లలో ఆ మూడు రోజులు దేశభక్తి సినిమాలు ప్రదర్శించవచ్చు. నాటకాలు, ఫ్యాన్సీ డ్రెస్లు, ఏకపాత్రాభినయాలు... ఇవన్నీ పెద్దలు, పిల్లలు కలిసి చేయవచ్చు. ఫోన్ పలకరింపుల్లో ‘హలో’ బదులు ‘వందేమాతరం’, ‘బై’ బదులు ‘జైహింద్’ వాడితే ఆ అనుభూతే వేరు. ఈ స్వాతంత్య్రం ఎందరో తెలిసిన తెలియని దేశభక్తుల త్యాగఫలం. వేలాది మంది తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వల్లే మనం ఇవాళ మన ఇంటిలో హాయిగా ఉన్నాం. కనుక వారందరి స్మృతిలో అన్నదానం, అనాథలకు సహాయం, అవసరంలో ఉన్నవారికి చేదోడు పనులు చేయడం కనీస కృతజ్ఞత. ఇంటింటా త్రివర్ణపతాకం కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుదాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. మూడు రోజుల పాటు దేశపటాన్ని కాషాయ, ధవళ, ఆకుపచ్చ వర్ణాలతో మిలమిలమెరిపిద్దాం. -
మత సామరస్యానికి ప్రతీక జిన్నా టవర్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : మత సామరస్యానికి ప్రతీక గుంటూరులోని జిన్నాటవర్ అని, ఎందరో మహానుభావుల త్యాగం వల్లే నేడు అందరం స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరంలో జిన్నా టవర్ పేరుతో కొన్ని మతతత్వ శక్తులు కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జిన్నాటవర్ పేరు మార్చాలని, లేకుంటే కూల్చేస్తామంటూ కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాలకు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. గురువారం సర్వమత పెద్దల ప్రార్థనల అనంతరం అక్కడ జాతీయ జెండాను హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ జిన్నా టవర్కు త్రివర్ణ పతాక రంగులు వేయడం చరిత్రాత్మకమన్నారు. దేశ పాలకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం బాధాకరమన్నారు. జిన్నా దేశభక్తుడంటూ అద్వానీ కీర్తించలేదా? ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీని హత్య చేసిన గాడ్సేను పూజించే బీజేపీ నేతలకు దేశభక్తి గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అద్వానీ పాకిస్తాన్ వెళ్లి జిన్నా దేశ భక్తుడంటూ కొనియాడిన సంగతి బీజేపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్లు మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తుంటే.. ఓర్వలేక వారి మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని స్వార్థపూరిత శక్తులు విఫలయత్నాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు జియాఉద్దీ¯న్, వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మోదుగుల వేణుగోపాల్రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, షేక్ సజీల, కమిషనర్ నిశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement