ఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్ | Andhra Pradesh Governor ESL Narasimhan reaches Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్

Oct 22 2013 6:03 PM | Updated on Sep 1 2017 11:52 PM

రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడి మూడు రోజులపాటు గవర్నర్ బసచేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర  విభజన సంబంధిత విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కేంద్ర మంత్రుల బృందం కీలక అంశాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మంత్రుల బృందానికి అందుబాటులో ఉండేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.
 
 

సీమాంధ్రలో ఒకపక్క ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగుతుండగా మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం విభజన అనంతరం  చోటు చేసుకునే కీలక అంశాలపై దృష్టి సారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement