
ఆయన్ను చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వచ్చారని ..
పోలాకి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని సినీనటుడు భానుచందర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని డమర – రాంపురం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్ను ఆదివారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జగన్తో కలిసి చాలా సేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్రలో విశేష ప్రజాదరణను చూసిన భానుచందర్.. జగన్ మోహన్రెడ్డిని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి పైగా ప్రజల్లో ఉండి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ పాదయాత్ర చేయటం గొప్ప విషయమన్నారు. ఈ పాదయాత్ర రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రగా నిలుస్తోందని కితాబిచ్చారు. రాజకీయాల్లో జగన్ అత్యంత ప్రభావ వంతమైన నాయకుడిగా ఎదిగారని, ఆయన్ను చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వచ్చారని చెప్పారు. పాదయాత్ర విజయవంతమై.. జగన్ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు.