ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో | acb rides on tagarapuvalasa vro | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో

Apr 15 2015 3:08 PM | Updated on Aug 17 2018 12:56 PM

విశాఖ జిల్లా తగరపువలస వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

తగరపువలస: విశాఖ జిల్లా తగరపువలస వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  తగరపువలసకు చెందిన టి.పరశురామ్ అనే వ్యక్తికి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు వీఆర్వో కె.ఈశ్వర్రావు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పరశురామ్ ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం పరశురామ్ నుంచి వీఆర్వో ఈశ్వర్రావు రూ.8వేలు లంచం తీసుకుంటుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు ఆయన ను పట్టుకున్నారు. వీఆర్వోని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement