అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 80 కిలోల గంజాయిని చోడవరం పోలీసులు పట్టుకున్నారు.
అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 80 కిలోల గంజాయిని చోడవరం పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలో తరలిస్తున్న 80 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని త రలిస్తున్న ఓ వక్తిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారు. కాగా.. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.