తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా అక్టోబరు నెలకు సంబంధించి మొత్తం 56,295 టికెట్లను టీటీడీ శుక్రవారం ఉదయం 10 గం టలకు ఆన్లైన్లో విడుదల చేసింది.
నగదు చెల్లించని టికెట్లను మరోసారి 17వ తేదీన లక్కీడిప్ ద్వారా ఇతర భక్తులకు కేటాయిస్తారు. మిగిలిన 43,800 సేవా టికెట్లలో కల్యాణోత్సవం 10,500, ఊంజల్సేవ 2800, ఆర్జితబ్రహ్మోత్సవం 6020, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకార సేవకు 13,300 టికెట్లను పాత పద్ధతిలోనే భక్తులు పొందారు. కాగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్ విధానంలో కేటాయించటం జూన్ 16వ తేదిన టీటీడీ ప్రారంభించింది. ఆరోజున సెప్టెం బరులో తిరుమల ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు సంబంధించి మొత్తం 10,710 టికెట్లను ఈ లక్కీడిప్ విధానం భక్తులకు కేటాయించారు. వాటిని అదే నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఈనెల 17న కేటాయిస్తారు.