20 కేజీల గంజాయి స్వాధీనం: నలుగురు అరెస్ట్ | 4 arrested; 20 kg ganja seized ananthagiri mandalam, visakhapatnam district | Sakshi
Sakshi News home page

20 కేజీల గంజాయి స్వాధీనం: నలుగురు అరెస్ట్

Oct 16 2013 9:19 AM | Updated on May 3 2018 3:17 PM

అనంతగిరి మండలం చిలకలగెడ్డ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విశాఖపట్నం జిల్లా పోలీసులు బుధవారం ఉదయం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

అనంతగిరి మండలం చిలకలగెడ్డ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విశాఖపట్నం జిల్లా పోలీసులు బుధవారం ఉదయం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. వారిని అనంతగిరి పోలీసు స్టేషన్కు తరలించారు.

 

అలాగే నిందితులకు సంబంధించిన వాహనాలను పోలీసులు స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 20 కేజీల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement