ఆర్టీసీ బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు | 3 injured ij road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు

May 18 2015 11:29 AM | Updated on Aug 30 2018 3:58 PM

కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడి డ్రైవర్ సహా ముగ్గురు గాయపడ్డారు.

ముదినేపల్లి : కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడి డ్రైవర్ సహా ముగ్గురు గాయపడ్డారు. భీమవరం నుంచి విజయవాడకు వెళుతున్న ఆర్టీసీ బస్సు విశ్వనాథపాళెం వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి రోడ్డుపక్కన గోతిలో బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement