236వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | 236rd Day PrajaSankalpaYatra Kick Starts | Sakshi
Sakshi News home page

236వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Aug 13 2018 8:11 AM | Updated on Aug 14 2018 8:39 AM

236rd Day PrajaSankalpaYatra Kick Starts - Sakshi

వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 236వ రోజు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది.

సాక్షి, తుని: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 236వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

తాటిపాక, బిళ్లనందూరు క్రాస్‌, బొడ్డువరం క్రాస్‌, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement