బైక్ను ఢీకొన్న బస్సు: ఇద్దరికి గాయాలు | 2 injured in a road accident | Sakshi
Sakshi News home page

బైక్ను ఢీకొన్న బస్సు: ఇద్దరికి గాయాలు

Nov 1 2015 8:29 PM | Updated on Aug 30 2018 3:56 PM

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్, నాగరత్నం బైక్‌పై నందిగామ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. హుస్సేన్‌కు తీవ్ర గాయాలు కాగా, నాగరత్నంకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement