14 అడుగుల రక్తపింజరి హతం
రాజాం/సంతకవిటి: సంతకవిటి మండలం గరికిపాడు పంచాయతీలోని బూరాడవాని చెరువులో మంగళవారం రక్తపింజరి పాము అలజడి సృష్టించింది. ఉపాధి పనుల్లో భాగంగా వేతనదారులు రెల్లపొదలను తొలగిస్తుండగా సుమారు 14 అడుగుల భారీ సర్పం బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. కొంతమంది ధైర్యంతో ముందుకెళ్లి పామును గునపాలు, కర్రలతో హతమార్చారు. అదే ప్రాంతంలో ఏడు గుడ్లు, రెండు పాము పిల్లలు లభ్యమయ్యాయి. వీటిని కూడా వేతనదారులు ధ్వంసం చేశారు. ఈ భారీ సర్పాన్ని చూసేందుకు చాలా మంది తరలివచ్చారు.