ఆటో బోల్తా: ఒకరి దుర్మరణం | 1 died in auto accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఒకరి దుర్మరణం

Aug 31 2015 9:22 AM | Updated on Sep 3 2017 8:29 AM

ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు.

రామచంద్రాపురం: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరి సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం మండలం గల్ల గ్రామానికి చెందిన పది మంది అన్నవరం క్షేత్రానికి ఆటోలో బయలు దేరారు. ఆ ఆటో జగన్నాథగిరి మలుపులో అదుపు తప్పి ర్యాంపులోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement