కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి

Aug 4 2025 3:24 AM | Updated on Aug 4 2025 3:24 AM

కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి

కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి

కడప ఎడ్యుకేషన్‌ : కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దాలని కేజీబీవీల సబ్జెక్టు టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ దేవరాజు పిలుపు నిచ్చారు. ఆదివారం కడప నగర శివార్లలోని గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ అధ్యక్షతన రాయలసీమ పరిధిలోని కేజీబీవీలలో పనిచేసే ఫిజిక్స్‌,కెమిస్ట్రీ సబ్జెక్టు టీచర్లకు ఇన్‌ సర్వీస్‌ రెసిడెన్షియల్‌ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణకు రాయలసీమ పరిఽధిలోని కడప, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాలతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ మాట్లాడుతూ కేజీబీవీలలో విద్యనభ్యసించే విద్యార్థులంతా చదువుతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారేనన్నారు. అలాంటి వారికి సేవ చేయడం మన అదృష్టింగా భావించాలని కోరారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే వారే నిజమైన ఉపాధ్యాయులన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయ సూపరింటెండెంట్‌ ప్రేమకుమారి, సెక్టోరియల్‌ అధికారి వీరేంద్రరావు, ఏఎస్‌ఓ సంజీవరెడ్డి, రిసోర్సు పర్సన్లు సమగ్రశిక్ష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ దేవరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement