కడప ఎడ్యుకేషన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు 2019, 2020, 2021, 2022 సంవత్సరంలో ఎంపికై ఈ ఏడాది 9,10,11,12 తరగతులు చదువుతూ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో రెన్యువల్ చేసుకున్నప్పటికీ విద్యార్థులు ఆధార్ను బ్యాంకు ఖాతాకు సీడ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి మర్రెడ్డి అనురాధ తెలిపారు. ఆధార్ను బ్యాంకు ఖాతాకు పీడ్ చేయని కారణంగా స్కాలర్షిప్ జమ కాని వారి వివరాలను ప్రభుత్వ పరీక్ష కార్యాలయం www.bse.ap. gov.in వెబ్సైట్లో ఉంచినట్లు ఆమె తెలిపారు. ఆ జాబితాలో పేరు ఉన్న వారు వెంటనే తన బ్యాంకు అకౌంట్కు ఆధార్ సీడింగ్ చేయించుకుని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా నగదు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే స్కాలర్షిప్ జమ కాదన్నారు. మెరిట్కార్డు, ఆధార్కార్డు, బ్యాంకు పాస్బుక్, విద్యార్థి లాగిన్లోని స్టేటస్ తీసుకుని సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఆధార్ సీడ్ చేయమని అడిగి చేయించుకోవాలని చెప్పారు. న్యూఢిల్లీ విద్యామంత్రిత్వశాఖ విద్యార్థి ఆధార్ నంబర్కు సీడ్ అయిన బ్యాంకు ఖతాకు డీపీటీ విధానంలో స్కాలర్షిప్ జమ చేయనున్నట్లు డీఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment