ఎక్కువ కేసుల రాజీ కోసం కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ కేసుల రాజీ కోసం కృషి చేయాలి

Published Sat, Jun 15 2024 11:42 PM | Last Updated on Sat, Jun 15 2024 11:42 PM

ఎక్కు

కడప అర్బన్‌ : జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎల్‌.వెంకటేశ్వరరావు తెలియజేశారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి సూచనల మేరకు మెదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎల్‌.వెంకటేశ్వరరావు, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్‌.బాబా ఫకృద్దీన్‌ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా కోర్టు హాల్‌లో ముందస్తు లోక్‌ అదాలత్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఈఓపీ అడ్వకేట్‌లతోపాటు, ఇతర న్యాయవాదులందరూ ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం కోసం ఫోన్‌ నంబర్లు: 08562– 258622, ఈమెయిల్‌ అడ్రస్‌: కెఎడిఎపిఎ.డిసిఒఆర్‌టిఎస్‌.జివొవి.ఐఎన్‌, డిఎల్‌ఎస్‌ఎకెడిపి అట్‌దిడేటాఫ్‌ జీమెయిల్‌ డాట్‌ కామ్‌ను సంప్రదించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం కడప అధ్యక్షుడు బి.గుర్రప్పనాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

రాయచోటి టౌన్‌ : లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొనే విధంగా అధికారులు ప్రజలకు తెలియజేయాలని జిల్లా 5వ అదనపు న్యాయమూర్తి కృష్ణన్‌ కుట్టి సూచించారు. శనివారం రాయచోటి కోర్టు ఆవరణలో అధికారులు, న్యాయవాదులతో లోక్‌ అదాలత్‌ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అన్ని రకాల క్రిమినల్‌, ప్రమాదాల కేసులు, సివిల్‌, ఎంఈవో వంటి కేసులు పరిష్కరించుకోవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ప్రసన్న, ప్రిన్సిపల్‌ జూనియర్‌ జడ్జి జీసీఏ సుల్తానా, అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ డాక్టర్‌ కె.శారద, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎక్కువ కేసుల రాజీ కోసం కృషి చేయాలి 1
1/1

ఎక్కువ కేసుల రాజీ కోసం కృషి చేయాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement