భువనగిరి: జాబ్మేళాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని జిల్లా ఉపాధికల్పనశాఖ అధికారి పద్మ కోరారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఉదిత ఓకేషనల్ జూనియర్ కళాశాలలో ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 45 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఎంపికై న 15మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో ఫార్మసీ కంపెనీ, నవత కంపెనీల మేనేజర్లు, జిల్లా ఉపాధికల్పన కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ నవనీత, పావం అలివేలు, చేగూరి రమణవాసు, పి. విజయ్ తదితరులు పాల్గొన్నారు.


