హైదరాబాద్ : పూల సోయగాలు.. పచ్చందాల మొక్కల సరాగాలు అలరిస్తున్నాయి. కొనుగోలుదారులతో స్టాళ్లు కిటకిటలాడుతున్నాయి.
నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ సమీపంలో ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో నర్సరీ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది.
అరుదైన, అలంకరణ, ఔషధ, పూల మొక్కలు ఒకే వేదికపై కొలువుదీరడంతో ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తోంది.
అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉండటంతో సందర్శకులు తమకు నచ్చిన వాటిని ఇంటికి తీసుకెళ్తున్నారు.
కాగా.. సోమవారం (నేడు) నర్సరీ మేళా ముగియనుంది.


