
మాదకద్రవ్యాలను అరికడదాం
భువనగిరిటౌన్: సమష్టి కృషితో మాదకద్రవ్యాలకు అడ్డుకట్టవేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో మహిళాశిశు, వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలను అరికడదాం