ట్రాక్టర్‌ తిరగబడడంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ తిరగబడడంతో రైతు మృతి

Jun 20 2025 5:16 AM | Updated on Jun 20 2025 5:16 AM

ట్రాక్టర్‌ తిరగబడడంతో  రైతు మృతి

ట్రాక్టర్‌ తిరగబడడంతో రైతు మృతి

తిప్పర్తి: పొలం దున్నుతుండగా ట్రాక్టర్‌ తిరగబడడంతో రైతు మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెంలో గురువారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి(51) ట్రాక్టర్‌తో గురువారం పొలం దున్నుతుండగా ట్రాక్టర్‌ బురదలో దిగబడింది. బురదలో నుంచి ట్రాక్టర్‌ను బయటకు తీసే క్రమంలో ట్రాక్టర్‌ తిరగబడింది. దీంతో వెంకట్‌రెడ్డి ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్‌ఐ రాంమూర్తి తెలి పారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ట్రాక్టర్‌ పైనుంచి పడి..

నూతనకల్‌: ట్రాక్టర్‌ పైనుంచి పడి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన నూతనకల్‌ మండలం పరిధిలోని పెద నెమిల గ్రామ పంచాయతీలో గురువారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నెమిల గ్రామ పంచాయతీకి చెందిన గంగుల వీరస్వామి(50) అదే గ్రామానికి చెందిన జెన్నారెడ్డి వివేక్‌రెడ్డి వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం వ్యవసాయ పొలంలో వీరస్వామి ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా.. బండ రాయిని ఎక్కడంతో అదుపుతప్పి వీరస్వామి ట్రాక్టర్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుమారుడు కమలాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement