
అధ్వానంగా కాల్వలు
సీసీ లైనింగ్తో ఆధునీకరించాలి
శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలను సీసీ లైనింగ్తో పూర్తిస్థాయిలో ఆధనీకరించాలి. అప్పుడు ప్రాజెక్టు సాగునీరు వృథాకావడం, అక్రమంగా నీటిని ఎగువకు తరలించడం పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. పేరుకే ప్రాజెక్టు ఆయకట్టులో ఉన్నాం. కానీ ఏనాడు చివరి భూములకు సాగునీరందిన దాఖలాలు లేవు.
– కట్ట వెంకట్రెడ్డి, రైతు, అడ్లూరు
పూడికతీతకు నిధులు లేవు
శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీసేందుకు నీటిపారుదలశాఖలో నిధులు లేవు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే తప్ప ప్రత్యేకంగా నిధులు వెచ్చించే పరిస్థితి నీటిపారుదలశాఖకు ఉండదు. ప్రస్తుతం వానాకాలం సాగు నేపథ్యంలో రైతులే తమ సొంత ఖర్చులతో కాల్వల్లో పూడికతీత పనులు చేయించుకోవాలని కోరుతున్నాం.
– సత్యనారాయణ, ఇరిగేషన్ డీఈఈ, శాలిగౌరారం ప్రాజెక్టు
శాలిగౌరారం: ఉమ్మడి జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులలో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు అధ్వానంగా మారాయి. ప్రధాన కాల్వలు దెబ్బతినడం, ప్రధాన కాల్వలపై ఉన్న పంట కాల్వల తూములు, షట్టర్లు పూర్తిగా ధ్వంసం కావడంతో సాగునీరు వృథాగాపోతుంది. అంతేకాకుండా కాల్వల్లో కంపచెట్లు, చెత్తాచెదాం నిండడడంతో ఆయకట్టు చివరికి సాగునీరందడం కష్టంగా మారుతోంది. దీంతో ఆయకట్టు చివరి భూముల రైతులు సాగునీరు కోసం నానా అవస్థలు పడుతున్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి నిల్లవ సామర్ధ్యంతో 6వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 19 అడుగుల మేర నీరు ఉంది.
సాగునీరందేది 6 కి.మీ. మాత్రమే..
శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల మొత్తం పొడవు 12 కిలోమీటర్లు. అందులో కుడి కాల్వ పొడవు 6.5 కిలోమీటర్లు, ఎడమ కాల్వ పొడవు 5.5 కిలోమీటర్లు. దశాబ్దాల కాలంగా ప్రధాన కాల్వలు మరమ్మతులకు నోచుకోకవడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఒకొక్క కాల్వ ద్వారా గరిష్టంగా 3 కిలోమీటర్ల వరకు కూడా సాగునీరు ప్రవహించని పరిస్థితి. ప్రధాన కాల్వల వెంట అక్రమంగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఎగువ ప్రాంతానికి నీటిని తరలించడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది.
మురుగునీటితో కష్టంగా పూడికతీత..
కుడి, ఎడమ ప్రధాన కాల్వలు నిత్యం డ్రెయినేజీ నీటితో నిండి ఉంటున్నాయి. కుడి కాల్వలోకి తిరుమలరాయునిగూడెం, బాలిశెట్టిగూడెం, మార్కెట్కాలనీ, పావురాలగూడెం గ్రామాల నుంచి డ్రెయినేజీలను కలిపారు. అదేవిధంగా ఎడమ కాల్వకు రామగిరి గ్రామం నుంచి వచ్చే డ్రెయినేజీని కలిపారు. దీంతో కుడి, ఎడమ కాల్వలు నిత్యం మురుగునీటితో నిండి ఉండటంతో కనీసం ఉపాధి హామీ పథకంలో భాగంగా కాల్వలను పూడిక తీసేందుకు కూలీలు ముందుకు రావడంలేదు. రైతులు సొంత ఖర్చులతో జేసీబీల సహాయంతో కాల్వలలో పూడిక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఫ కంప చెట్లు, చెత్తాచెదారం,
మురుగునీటితో నిండిన శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు
ఫ ఆందోళనలో ఆయకట్టు చివరి రైతులు

అధ్వానంగా కాల్వలు

అధ్వానంగా కాల్వలు

అధ్వానంగా కాల్వలు