కొత్త అడ్మిషన్లు 4,884 | - | Sakshi
Sakshi News home page

కొత్త అడ్మిషన్లు 4,884

Jun 20 2025 6:47 AM | Updated on Jun 20 2025 6:47 AM

కొత్త

కొత్త అడ్మిషన్లు 4,884

అందరి సహకారంతోనే

అడ్మిషన్ల సంఖ్య పెరిగింది

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు జిల్లాలోని ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయడం, శ్రమించడం వల్లే ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధించారు.

– సత్యనారాయణ,

జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రభుత్వ పాఠశాలల్లో

పెరిగిన నూతన ప్రవేశాలు

గత సంవత్సరంతో

పోలిస్తే 21 శాతం పెరుగుదల

సత్ఫలితాలిచ్చిన బడిబాట

ఫ 35,989కు చేరిన విద్యార్థుల సంఖ్య

భువనగిరి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలతో పాటు బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట ప్రారంభించారు. 14 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో 4,884 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది.

ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 35,989

జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 35,558 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 484 ప్రాథమిక పాఠశాలు ఉండగా వీటిల్లో 14,195 మంది విద్యార్థులు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా వీటిల్లో 3216 మంది విద్యార్థులు, 163 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిల్లో 18,147 మంది విద్యార్థులున్నారు. మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మొత్తం 4453 విద్యార్థులు పరీక్షలకు హాజరై పాఠశాలలను వదిలి వెళ్లారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 31,105కు చేరింది. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందిన వారి సంఖ్య 4,884 మంది విద్యార్థులు కావడంతో ప్రస్తుతం మొత్తం 35,989కి చేరింది. దీంతో గత సంవత్సరం కంటే ప్రస్తుతం 431 మంది విద్యార్థులు అధికంగా పాఠశాలల్లో చేరారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఫలితాలిచ్చిన కార్యక్రమాలు ఇవీ..

ఫ డీఎస్సీ–2024 ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియామకం, బదిలీలు, పదోన్నతలు ప్రక్రియ చేపట్టి ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేశారు.

ఫ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, డిజిటల్‌ తరగతులు, చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రత్యేక శ్రద్ద పెట్టారు.

ఫ కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేక చొరవ తీసుకుని పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదో తరగతిలో 500కు పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

ఫ ఈ సారి ముందస్తుగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

బడిబాట ద్వారా పాఠశాలల్లో చేరిన విద్యార్థులు

సంవత్సరం విద్యార్థులు

2023 & 24 4,419

2024 & 25 4,040

2025 & 26 4,884

కొత్త అడ్మిషన్లు 4,8841
1/1

కొత్త అడ్మిషన్లు 4,884

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement