
దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు
రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు దోస్త్ రిజిస్ట్రేషన్ను జూన్ 25వరకు పెంచినట్లు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాహత్ఖానం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, తత్సమాన పరీక్ష పాసై, ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. భక్తులు వివిధ పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
వన మహోత్సవానికి సిద్ధం కావాలి
బొమ్మలరామారం: వన మహోత్సవంలో భాగంగా అధికారులు మొక్కలు నాటేందుకు
సిద్ధం కావాలని జెడ్పీసీఈఓ శోభారాణి అన్నారు. బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్లోని నర్సరీని గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. వన మహోత్సవంలో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రతి ఇందిరమ్మ ఇంటికి ఇంకుడుగుంత తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజాత్రివిక్రమ్, సూపరింటెండెంట్ జ్ఞాన ప్రకాష్రెడ్డి, ఈసీ పుష్ప, పంచాయతీ కార్యదర్శి హన్మాన్, ఎఫ్ఏ సంజీవ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలి
యాదగిరిగుట్ట రూరల్: గ్రామస్థాయి నుంచి మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని వీలీడ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అంబేద్కర్ అన్నారు. బోస్కో సేవా కేంద్రం, యాత్ర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో గురువారం జెండర్ సమానత్వం–మహిళా నాయకత్వం–సాధికారతపై మహిళా నాయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీ లీడ్ ప్రోగాం కోఆర్డినేటర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా సాధికారితకు యాత్ర సంస్థ ద్వారా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు, రెండవ విడత శిక్షణ వచ్చే నెలలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో యాత్ర సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం తదితరులు పాల్గొన్నారు.

దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు