
పెండింగ్ సమస్యలకు మోక్షం కలిగేనా!
సాక్షి, యాదాద్రి : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వ భూముల పంపిణీ, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కేటాయింపు, సబ్ ప్లాన్ నిధులతో పాటు అట్రాసిటీ కేసుల విషయంలో న్యాయం జరగడం లేదని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం, శనివారం రెండు రోజులు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటించనున్న నేపథ్యంలో తమ సమస్యలు ఏ కరువు పెట్టేందుకు సంబంధిత వర్గానికి చెందిన నాయకులు సిద్ధమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో కేసులు పరిష్కరించాలని, వివిధ అభివృద్ధి పథకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, సబ్ప్లాన్ నిధులు, అట్రాసిటీ కేసుల విషయంలో సత్వర న్యాయం చేయాలని కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి దళిత, గిరిజన సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు.
పర్యటనకు ఏర్పాట్లు
చేస్తున్న యంత్రాంగం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శుక్రవారం యాదగిరిగుట్టకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ వార్షికోత్సవంలో పాల్గొంటారు. కమిషన్ చైర్మన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
రెండు రోజులు పర్యటించనున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
ఫ నేడు రాత్రి యాదగిరిగుట్టలో బస
ఫ శనివారం కలెక్టరేట్లో
సమీక్షా సమావేశం
ఫ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి
సమస్యలు ఏకరువు పెట్టేందుకు
సిద్ధమవుతున్న నాయకులు
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు
ఎస్సీ, ఎస్టీ కేసులకు సత్వర పరిష్కారం లభించడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి పదేళ్లవుతున్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇంకా ఇక్కడ ఏర్పాటు కాలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు నల్లగొండ జిల్లా కేంద్రంలోనే ఉండడంతో బాధితులు అక్కడకు వెళ్లి రావడం అసౌకర్యంగా ఉంది.
అత్యాచార బాధితుల కేసులో పరిహారాలు అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పరిహారం ప్రొసీడింగ్స్కే పరిమితమవుతున్నాయి. జిల్లాలో సుమారు రూ.50 లక్షల వరకు చెల్లించాల్సిన పరిహారం పెండింగ్లో ఉంది.
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రతి సంవత్సరం 120 మంది విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తారు. నాలుగు సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి.
2021 నుంచి ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు సంబంధించి ప్రోత్సాహకం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 90 జంటలు కులాంతర వివాహాలు చేసుకోగా.. ప్రభుత్వం ఇచ్చే రూ. 2.50 లక్షల కోసం ఎస్సీ డెవలప్మెంట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఇవ్వాల్సిన సబ్సిడీ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంది.