
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
భువనగిరి: మండలంలోని బండసోమారం గ్రామంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇంటి యజమానులతో మాట్లాడారు. ఇళ్ల ఎలా ఉందని, ఇంటి కల నేరవేరిందా అని, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటి యాజమానులకు దస్తులు, గ్యాస్ స్టౌవ్ అందజేసి వారిని శాలువాలతో సన్మానించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్లు బర్రె జహంగీర్, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఫక్కీర్ కొండల్రెడ్డి, చిక్కుల వెంకటేశం, మాజీ సర్పంచ్ నానం పద్మ కృష్ణ, సురుపంగ అయిలయ్య, ఉప సర్పంచ్ యాట రాజు, దంతూరి శ్రీనివాస్గౌడ్, మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అంతకు ముందు ఆస్పత్రి ఆవరణలో కేట్కట్ చేసి స్వీట్లు అందజేశారు.