పేదలందరికీ సొంత ఇల్లు | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ సొంత ఇల్లు

Jun 20 2025 6:47 AM | Updated on Jun 20 2025 6:47 AM

పేదలందరికీ సొంత ఇల్లు

పేదలందరికీ సొంత ఇల్లు

సాక్షి, యాదాద్రి, తుర్కపల్లి: పేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో అర్హులైన 205 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఆకుల ఆగవ్వకు మొదటి ప్రొసీడింగ్‌ పత్రం అందజేశారు. అనంతరం వాసాలమర్రిలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.22.500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇలా రాబోయే మూడున్నరేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. వాసాలమర్రి గ్రామ అభివృద్ధికి

సహకరిస్తామని ఈ నెల 6న తిర్మాలపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారని చెప్పారు. మొదటగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి, 205 మంది లబ్ధ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రతి రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనలతో భూభారతి– 2025 తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వాసాలమర్రిలో లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకునేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎంపీ కిరణ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఆలేరు అభివృద్ధిలో ముందుండేలా చూసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి సమస్య పరిష్కారానికి గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామన్నారు. కలెక్టర్‌ హనుమంతరావు, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, అదనవు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌ రావు, ఆర్డీఓ కృష్ణా రెడ్డి, తహసీల్దార్‌ దేశ్యానాయక్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ ఏఈ శ్రీరాములు, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఐనాల చైతన్య మహేందర్‌ రెడ్డి, మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌ రెడ్డి, నాయకులు నీలం సంజీవ రెడ్డి, జనగాం ఉపేందర్‌ రెడ్డి, దనావత్‌ శంకర్‌ నాయక్‌, చాడ భాస్కర్‌ రెడ్డి, రాజారాం నాయక్‌, పలుగుల శ్రీనివాస్‌, ఎలుగల రాజయ్య, బోరెడ్డి హనుమంతురెడ్డి, మహిపాల్‌ రెడ్డి, బాబు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

ఫ వాసాలమర్రిలో లబ్ధిదారులకు

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

పత్రాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement