
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కావాలి
మోత్కూరు: ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేయాలని కలెక్టర్ వి.హనుమంతరావు ఆదేశించారు. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ధాన్యంలోని తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేయాలన్నారు. కేంద్రాలలో రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే అధికారుల దృష్టికి తేవాలన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన
అదనపు కలెక్టర్
మోత్కూరు మార్కెట్ యార్డులో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి సందర్శించారు. ధాన్యం రాశులను పరిశీలించారు. వారివెంట అధికారులు వడ్డేమాన్ కీర్తి, తుంగ గోపినాథ్, ముక్కాముల అశోక్, సింగిల్విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, సీఈఓ వరలక్ష్మి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు