వృద్ధురాలికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలికి గాయాలు

Apr 25 2025 1:04 AM | Updated on Apr 25 2025 1:04 AM

వృద్ధురాలికి  గాయాలు

వృద్ధురాలికి గాయాలు

అడ్డగూడూరు: వలింగొడ–తొర్రూర్‌ జాతీయ రహదారిపై అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామంలో తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా.. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ స్టేజీ వద్ద ఎదరుగా వస్తున్న డీసీఎం తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న పెండెం గౌరమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలపిపారు.

నాణ్యత పాటించని

హోటళ్లకు జరిమానా

సూర్యాపేట అర్బన్‌: సూర్యాపేట పట్టణంలో నాణ్యత పాటించని పలు హోటళ్లకు గురువారం మున్సిపల్‌ అధికారులు జరిమానా విధించారు. వివరాలు.. పట్టణంలోని డీమార్ట్‌ సమీపంలోని కావేరి రెస్టారెంట్‌లో మాంసం, చికెన్‌ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి వినియోగిస్తున్నందన మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు రూ.5000 జరిమానా విధించారు. ఈ రెస్టారెంట్‌ పక్కనే గల దిల్‌కుష్‌ బేకరీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచనందుకు రూ.500, నిల్వ ఉంచిన పదార్ధాలతో ఫాస్ట్‌ఫుడ్‌ చేస్తున్న గాయత్రి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌, స్సైసీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌ తెలిపారు. తనిఖీల్లో హెల్త్‌ అసిస్టెంట్‌ మస్కాపురం సురేష్‌, సిబ్బంది బాషుమియా, యాదగిరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement