
ఇక నుంచి డ్రోన్ ద్వారా పెట్రోలింగ్
భువనగిరిటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించనున్నామని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఎస్సీ కంకణాల రాహుల్రెడ్డి తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించేందుకు భువనగిరి పట్టణ శివారు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సోమవారం డ్రోన్ను ప్రయోగాత్మకంగా ఎగురవేశారు. డ్రోన్ద్వారా పరిశీలించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వ్యక్తులను పట్టుకు న్నారు. ఈ సందర్భంగా అదన పు ఎస్పీ మాట్లాడుతూ.. విజి బుల్ పోలీసింగ్, సత్వర స్పందన, టెక్నాలజీకి.. ఈ మూడింటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలి పారు. ప్రతి ఏరియాలో బ్లూ కోల్ట్స్, పెట్రోకార్, సైకిల్ పెట్రోలింగ్తో పాటు డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత భువనగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించి ఎటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయో పరిశీలిస్తామన్నారు. టెక్నాలజీ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు.
ఫ రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా..
ఫ పైలెట్ ప్రాజెక్టుగా భువనగిరి
ఫ వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ రాహుల్రెడ్డి

ఇక నుంచి డ్రోన్ ద్వారా పెట్రోలింగ్

ఇక నుంచి డ్రోన్ ద్వారా పెట్రోలింగ్