టెన్నిస్ ఆడుతున్న క్రీడాకారులు
భీమవరం : స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీల సెమీఫైనల్స్ హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం నిర్వహించిన పోటీల్లో పలువురు విజేతలుగా నిలిచారు.
సింగిల్స్ విభాగంలో..
70+ ఫైనల్స్లో కె.రాధాకృష్ణమూర్తిపై 6–4, 6–4 పాయింట్లతో ఎస్.సేతు విజేతగా నిలిచారు.
65+ విభాగంలో ఎస్.ఆనంద్ స్వరూప్పై వి.శ్రీనివాసరెడ్డి 6–3, 6–4 పాయింట్లతో విజయం సాధించారు.
55+ విభాగం సెమీఫైనల్స్లో సీహెచ్ శివపై 6–1, 6–0 పాయింట్ల తేడాతో కేవీఎన్ మూర్తి, బాబు రాజాపై 6–4, 6–3 పాయింట్ల తేడాతో డి.సుధాకర్రెడ్డి గెలుపొందారు.
45+ సెమీఫైనల్స్పై కె.సంపత్ కుమార్పై ఎంవీఎల్ఎన్ రాజు 6–3, 7–5 తేడాతో గెలుపొందారు.
35+ సెమీఫైనల్స్లో కె.అమిత్రెడ్డిపై 6–1, 6–2 తేడాతో ఈశ్వర్ సాయి, కొప్పుల సతీష్పై 6–1, 6–1 తేడాతో ఎన్.డి. విజయ్ ఆనంద్ విజయం సాధించారు.
డబుల్స్ విభాగంలో
70+ విభాగంలో ఎం.సాయిరామ్బాబు, ఎస్.ఎ రాజాక్పై ఎ.రాంబాబు, ఎస్.సేతు 6–4, 7–5 విజయం సాధించారు. డీఎస్ఎన్ రాజు, టి.సుందర్ వడి వేలుపై ఎన్.అశోక్ రెడ్డి, కె.సీతా రామరాజు 6–3, 6–3 పాయింట్లతో విజయం సాధించారు.
65+ విభాగంలో జి.చంద్రశేఖర్, కె.కోటయ్యగౌడ్పై వి.శ్రీనివాసరెడ్డి, ఎస్.మన్మథరావు 6–2, 6–2 తేడాతో, పి.చంద్ర, సలీంపై ఎస్.ఆనంద్ స్వరూప్, టి.శ్రీనివాస్ 6–2, 6–2 పాయింట్ల తేడాతో గెలుపొందారు.
55+ విభాగంలో ఎ.వెంకటేశ్వర్లు, శంకర్రెడ్డిపై కె.వి.ఎన్ మూర్తి, హేమంత్ కుమార్ 6–1, 6–0 తేడాతో విజయం సాధించారు.


