
సత్వర న్యాయానికి కృషి
నరసాపురం: నిబద్ధత, అంకితభావంతో పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ న్యాయవాదులకు సూ చించారు. ఆదివారం నరసాపురం వచ్చిన ఆయన న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ హాల్లో సమావేశం నిర్వహించారు. రోజురోజుకూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు తమ న్యాయ పరి జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. న్యాయవాదులు న్యాయపరమైన అంశాలపై, చట్టాలపై, న్యాయశాస్త్ర సూత్రాల పై చర్చా వేదికలు నిర్వహించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. న్యాయస్థానాల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ న్యాయస్థానాలు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసి విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి ఎ. వాసంతి, సీనియర్ సివిల్ జడ్జి జి.గంగరాజు, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఆర్.వరలక్ష్మి, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్.రాజ్యలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విన్నా సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో సోమవారం నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత 5.51 లక్షల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ సంఘ భవనంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా వడ్లపట్ల మురళి, ప్ర ధాన కార్యదర్శిగా జంగం రవీంద్ర, కోశాధికారిగా బుర్ర శ్రీధర్, గౌరవాధ్యక్షుడిగా గారపాటి ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్లుగా వి.శ్రీనివాసరావు, ఆర్.శైలజ, వి.హరి సీతారామయ్య ఎన్ని కయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎ.సర్వేశ్వరరావు, హెడ్ క్వార్టర్ సెక్రటరీగా పి.సురేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎల్సీ కేశవరావు వ్యవహరించారు. జిల్లాలో ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వము, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించి, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు తీర్మానించారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని భూ సమస్యలపై సోమవారం కలెక్టర్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్టు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ప్రకటనలో తెలిపారు. భూ స మస్యలు ఎదుర్కొంటున్న గిరిజనులు, దళి తులు, పేదలు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025కు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఆదివారం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

సత్వర న్యాయానికి కృషి