అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను జిల్లాలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి కానుకలు స్వీకరించారు. హారతి ఇచ్చి ఆశీర్వదించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంటింటా సందడి నెలకొంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మిఠాయి, రాఖీ దుకాణాలు కిటకిటలాడాయి.
– సాక్షి, నెట్వర్క్
– మరిన్ని ఫొటోలు 8లో


