ఆస్తికంటే చెల్లిపై ప్రేమ ఎక్కువ
న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026
తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న
కష్టమే రానివ్వనని ఒకరు. ఆపదొస్తే అండగా నిలుస్తానని మరొకరు. నీకు నేనున్నానంటూ ఇంకొకరు.. తోబుట్టువుకు సగం ఆస్తి రాసిచ్చిన అన్న ఒకరు. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తమ్ముడొకరు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. రాఖీ పండుగకు అసలైన అర్థం చెబుతున్న వీరందరి గురించి రక్షాబంధన్ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది.
ఆ ‘ఉత్తమ’అధికారి.. అవినీతి ‘గని’!?
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో గనులశాఖ ఏడీ జయరాజు కార్యాలయంతో పాటు సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
కాశిబుగ్గ: కొత్తవాడకు చెందిన దువ్వ సాంబమూర్తి–రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా, ఒక కుమారుడు రాజ్కుమార్, కుమార్తె శీరిష ఉన్నారు. వికలాంగుడైన తండ్రి సాంబమూర్తి కుమార్తె పెళ్లి చేసిన తర్వాత మరణించాడు. చెల్లెలిపై ప్రేమతో అన్న రాజ్కుమార్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) చెల్లి, బావకు కొత్తవాడలోని ఇంట్లోనే నివాసం కల్పించాడు. చెల్లెలిపై ప్రేమతో ఆరునెలల క్రితం పుర ప్రముఖుల సమక్షంలో 180 గజాల ఇంటి స్థలంలో సగం 90 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి, కాగితాలు అప్పగించాడు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్కుమార్ను అందరూ అభినందిస్తున్నారు.
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన నక్కపల్లి ప్రసాద్ తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ చెల్లెళ్లను ఉన్నత చదువులు చదివించాడు. అతడి చెల్లెళ్లు రాజేశ్వరి, అరుణ పెళ్లి చేశాడు. అమ్మానాన్న లోటు లేకుండా పెంచి పెద్ద చేసిన అన్న ప్రసాద్ అంటే వారికి ఎనలేని ప్రేమ. ఎక్కడున్నా అన్నకు ప్రతీ ఏడాది రాఖీ కడతారు. చెల్లెళ్లకు సైతం ప్రసాద్ తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు.
అమ్మానాన్న అన్నీ అన్నయ్యే..
దుగ్గొండి: చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. అమ్మానాన్న లేని లోటు ఉండొద్దని అన్నీ తానై చెల్లికి అండగా నిలిచాడు అన్నయ్య. నాచినపల్లి గ్రామానికి చెందిన నంగునూరి చేరాలు– స్వరూప దంపతులు అనారోగ్యంతో 20 ఏళ్ల క్రితం మృతి చెందారు. అప్పటికి వారికి 8 సంవత్సరాల కుమారుడు హరీశ్, ఐదు సంవత్సరాల కుమార్తె, ప్రత్యూష ఉన్నారు. ఎలాంటి ఇల్లు, ఆస్తిపాస్తులు, లేవు. చేరాలు అన్నదమ్ములు వారిని కొంతకాలం ఆదరించారు. హరీశ్ గుండె ధైర్యంతో ముందుకు సాగాడు. స్వచ్ఛంద సంస్థ బడిలో చేరి చదివాడు. దాతల సహకారంతో చెల్లిని ఢిల్లీలోని నేషనల్ కాలేజీలో ఎమ్మెస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చదివించాడు. హరీశ్ బెంగళూరులో న్యాయవిద్యను పూర్తిచేశాడు. వీరు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీపాద వెంకటేశ్వర్లు, సరోజ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు శ్రీపాద సురేశ్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి ప్రతీ సంవత్సరం పర్వతగిరికి వస్తుంటాడు. మిగిలిన నలుగురు అన్నదమ్ములు సతీశ్, రఘు, రవి, రాము పర్వతగిరికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు. ఐదుగురు అన్నదమ్ములంటే తనకు ప్రాణమని ఏటా వారికి రాఖీ కడతానని ప్రియాంక చెబుతోంది.
డోర్నకల్: డోర్నకల్లోని బ్యాంకు స్ట్రీట్కు చెందిన కాలా యశోధర్ జైన్కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెల్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్జైన్కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు.
తండ్రి ప్రేమను పంచిన పలువురు అన్నలు
ఆస్తి కాదు.. అనుబంధమే ముఖ్యమంటున్న ఓ సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తున్న సోదరులు
రాఖీ కట్టి రక్షగా నిలుస్తామంటున్న సోదరీమణులు నేడు రాఖీ పౌర్ణమి


