
ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం
సంక్షేమమే సేవ సైన్స్ లక్ష్యం
సెరికల్చర్ విద్యార్థుల ప్రదర్శన
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువత ఆవిష్కరణలు దేశానికి ఆదర్శమని డీఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సలహా దారు డాక్టర్ సతీష్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణో త్సవం సందర్భంగా తెలంగాణ అకాడమీ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ మంగళవారం క్యాంపస్లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో సావనీర్, రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సతీష్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇన్నోవేటివ్ స్కిల్స్ అండ్ ఎంపవర్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతీ రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం, ఎఐఎంఎస్, నిట్స్ సెంట్రల్ యూనివర్సిటీలు ఉండడం వల్ల అనేకమంది విద్యార్థులు ఆవిష్కరణలు, పరిశోధనాపత్రాల ప్రచురణలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం 75శాతం విద్యార్థులు విదేశాలనుంచి తిరిగి వచ్చి మాతృభూమిలో ఆవి ష్కరణలు చేస్తున్నారన్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన 90శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. తమ గ్రామం నుంచి తానొక్కడినే ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 1.75మిలియన్ స్టార్టప్స్ వచ్చాయన్నారు. ఏ గ్రా మం, ఏకుటుంబం నుంచి వచ్చామనేది ముఖ్యం కాదని, ఏ ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తున్నామన్నదే ముఖ్యమన్నారు. యువత మైండ్సెట్ మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సాంకేతికతతో పోటీ పడే మనస్తత్వం రావాలన్నారు.
టీబీ నియంత్రణకు నూతన ఔషధాలు
టీబీ నియంత్రణకు నూతన ఔషధాల అభివృద్ధి తప్పనిసరి అని హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందుకూరి వెల్లడించారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో ‘టీబీ మెకానిస్టిక్ ఇన్సైట్స్ ఇన్ టూ హౌది పాజిటివ్ పాథోజెన్ సర్వైవ్స్ ఇన్ది హోస్ట్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ట్యూబర్కులోసిస్కు కారణమైన మైక్రోబాక్టీరియం టూ బర్కులోసిస్ (ఎంటీబీ)లో ఔషధ నిరోధకత పెరుగుతుందన్నారు.
ఆధునిక రక్షణ సాంకేతికలు అభివృద్ధి
దేశ అభివృద్ధిలో రక్షణ, సాంకేతికతల పాత్ర ఎంతో కీలకమని, రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి ప్రభుత్వ పెట్టుబడులు శాస్త్ర సాంకేతిక పురోగతికి ఆధునిక రక్షణ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్రపోషిస్తాయని బెంగళూరు డీఆర్డీఎ ఎల్ఆర్డీఈ డైరెక్టర్ విశ్వం అన్నారు. ‘ఆర్అండ్డీ డిఫెన్స్ టెక్నాలజీస్ అపార్చునిటీస్ అండ్ చాలెంజెస్–ఏ 2047 పర్సెక్టివ్స్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
యువతకు ఆలోచనలే కీలకం
డీఆర్డీఓ మాజీ చైర్మన్,
భారత ప్రభుత్వ రక్షణ
మంత్రిత్వశాఖ సలహాదారు సతీష్రెడ్డి
కేయూలో తెలంగాణ
సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
సావనీర్, రెండు పుస్తకాలు ఆవిష్కరణ
కేయూ వీసీ ప్రతాప్రెడ్డి
సంక్షేమమే సేవ సైన్స్ లక్ష్యం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. క్వాంటం ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్తో నూతన నూతనశాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. స్వర్ణోత్సవంలోకి అడిగిడిన సందర్భంగా టాస్తో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తున్నామన్నారు. కేయూలో రూసా ప్రాజెక్టు కింద రూ.50కోట్లు మంజూరు కాగా, అందుకు సంబంధించిన పరిశోధనలు, ప్రాజెక్టులపై ఆచార్యులు దృష్టి సారించారన్నారు. అక్టోబర్లో కేయూ కె హబ్తో టీహబ్ ఎంఓయూ చేసుకుందని, దీనితో ఇన్నోవేషన్ ఇంక్యూబేషన్, స్టార్టప్లతో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. కేయూ టాస్ జనరల్ సెక్రటరీ, ఓయూ మాజీ వీసీ సత్యనారాయణ మాట్లాడుతూ యువత సైన్స్ అండ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణల దిశగా ముందుకెళ్లాలని సూచించారు. రిజిస్ట్రార్ రామచంద్రం, తెలంగాణ సైన్స్కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రామ్రెడ్డి, టాస్ ట్రెజరర్ ప్రొఫెసర్ ఎస్ఎంరెడ్డి మాట్లాడారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్తాఫ్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
కేయూలోని ఆడిటోరియం వద్ద సెరికల్చర్ విద్యార్థుల పట్టుపురుగుల ప్రదర్శన ఆకట్టుకుంది. డాక్టర్ సుజాత విశిష్టతను వివరించారు. మల్బరీ నాన్మల్బరీ గూడిపట్టు చీలుకులపై బోధన, పెంపకం, పరిశోధనపై నిర్వహించే అంశాలపై వివరించారు. ఇదిలా ఉండగా.. సెనెట్హాల్లో విద్యార్థులు, సైంటిస్టులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వెంకటేశ్వర్రావు, విజ్ఞాన్ప్రసాద్, రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్గా ఆచార్య జ్యోతి పాల్గొన్నారు.

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం

ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం