– మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/రాజాపూర్
సొంత ల్యాబ్.. విద్యార్థులకు ఉచిత ప్రయోగాలు!
● బడిని బోధనకు మాత్రమే పరిమితం చేయకుండా.. విజ్ఞానం, విలువలు నేర్పుతున్న టీచర్లు
● వినూత్న బోధనతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
● రూ.12 లక్షలతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు
తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు జీవితానికి దిశానిర్దేశం చేస్తారు. పుస్తకంలోని అక్షరాలను పరిచయం చేయడమే కాదు.. ఆ అక్షరాల వెనుక ఉన్న ప్రపంచాన్ని విద్యార్థులకు చూపిస్తారు. చీకటిలో దారి తప్పినవారికి దీపంలా.. సందిగ్ధంలో ఉన్నవారికి దిక్సూచిలా నిలిచి, ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తారు. అందుకే గురువు తరగతి గదిలో కనిపించే ఓ వ్యక్తి మాత్రమే కాదు.. రేపటి సమాజాన్ని నిర్మించే శిల్పి. పదవీ విరమణ చేసినా బోధనకు దూరం కాకుండా బడిబాట పడుతున్నవారు కొందరైతే.. గణితం అంటే భయపడే విద్యార్థుల్లో ఆసక్తిని నింపుతున్న వారు మరికొందరు. గిరిజన తండాల పిల్లలను బడికి రప్పించి చదువుతో పాటు సేంద్రియ సాగు నేర్పుతున్నవారు.. చాక్లెట్కు బదులు మొక్కను అందించి ప్రకృతిపై ప్రేమను పెంచుతున్నవారు.. సొంత ఖర్చుతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రయోగాల ప్రపంచాన్ని విద్యార్థుల ముందుకు తీసుకొస్తున్నవారు ఇంకొందరు. వారి చేతిలో ఉన్నది సుద్ద ముక్కే.. కానీ ఆ సుద్దతో రాసేది కేవలం పాఠం కాదు.. ఓ విద్యార్థి భవిష్యత్. వారి బోధనలో అక్షరాలే కాదు.. ఆలోచనలు ఉన్నాయి. వారి అడుగుల్లో ఉద్యోగ బాధ్యత కాదు.. రేపటి తరంపై బాధ్యత ఉంది. ఇలా వీరి ప్రతి అడుగు విద్యార్థుల భవిష్యత్ కోసమే. శనివారం (నేడు) జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థి జీవితాల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న గురువులపై ప్రత్యేక కథనం..
చాక్లెట్కు బదులు.. మొక్క!
వినూత్న బోధనతో విద్యార్థుల్లో కొత్త అలవాట్లు


