దుఃఖంలోనూ ఆదర్శం.. తల్లి నేత్రాలు దానం | - | Sakshi
Sakshi News home page

దుఃఖంలోనూ ఆదర్శం.. తల్లి నేత్రాలు దానం

Aug 12 2025 11:21 AM | Updated on Aug 13 2025 7:42 AM

దుఃఖంలోనూ ఆదర్శం.. తల్లి నేత్రాలు దానం

దుఃఖంలోనూ ఆదర్శం.. తల్లి నేత్రాలు దానం

కంచరపాలెం: పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకున్న ఘటన జీవీఎంసీ 47వ వార్డు, కంచరపాలెం, ఇందిరానగర్‌–5లో జరిగింది. తమ తల్లి మరణంతో తీవ్ర శోకంలో ఉన్నప్పటికీ ఆమె కళ్లను దానం చేసి ఆ కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గండిబోయిన ఈశ్వరమ్మ (75) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కేజీహెచ్‌లో మృతి చెందారు. తల్లి మరణంతో ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఈశ్వరమ్మ భర్త అప్పారావు, కుమారులు అప్పలరాజు, సూర్యచంద్రరావు, కుమార్తె లక్ష్మి ఆమె కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి ఆదర్శ ఆలోచనతో మోషిని ఐ బ్యాంక్‌కు నేత్రదానం చేశారు. ఎల్వీ ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నీషియన్‌ అజయ్‌ సహకారంతో కంటి రెటీనాను తొలగించి తరలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక వ్యక్తి దానం చేసే కళ్లతో నలుగురికి కూడా చూపునివ్వవచ్చని కంటి వైద్య నిపుణులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement