లారీ ఢీకొని విద్యార్థిని దుర్మరణం

- - Sakshi

విశాఖపట్నం: అనగంపూడి దరి శనివాడ ప్రధాన రహదారి సిగ్నల్‌ పాయింట్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మాసిటీ ప్రాంతానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లేమర్తిలోని ఫార్మాసిటీ కాలనీకి చెందిన కొల్లిమల్ల పెదనరసింగరావు క్రేన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కూతురు జయసాహితి (15) పదో తరగతి చదువుతోంది. మల్కాపురం నుంచి ఫార్మాసిటీ వైపు తన తల్లి గోవిందమ్మతో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా అగనంపూడి దరి శనివాడ జంక్షన్‌ వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న సాహితి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top