రెండు ఎకరాల్లో ఉల్లి, రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. ఉల్లి సాగుకు రూ.80వేల పెట్టుబడి పెట్టా. ఊట దశలో ఉంది. ఆకు పూర్తిగా తూట్లు పడి పోయింది. మొక్కజొన్న కంకులు వచ్చే దశలో ఉంది. ఆకులు పూర్తిగా రాలిపోయాయి. అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయా. వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వం పంట పరిహారం అందిచేలా చర్యలు తీసుకోవాలి.
– మెట్టు రాములు, రైతు, ఏన్కతల
పరిహారం ఇవ్వాలి
వడగళ్ల వానకు పంటలు పాడయ్యాయి. ఎక్కువగా ఉద్యాన పంటలుండడంతో రైతులు కోలుకునే పరిస్థితి లేదు. రూ.లక్షల్లో పెట్టుబడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ హయాంలో వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చాం. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి తాత్సారం చేయకుండా ఎకరాకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
– ఆనంద్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు