
హైదరాబాద్, సాక్షి: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమాలతో పాటు అభిమానుల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, పలువురు న్యాయమూర్తులు, సీనియర్ జర్నలిస్టులు,రిటైర్డ్ ఉన్నతాధికారులు ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. మంగళవారం సాయంత్రం 4గం. నుంచి మాదాపూర్(హైటెక్ సిటీ-జేఎన్టీయూ దారిలో..) బుట్ట కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు.

