వ్యాక్సిన్‌ కొరత: మే 31వరకు రెండో డోసే | Vaccine Shortage Second Dose Up To 31 | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ కొరత: మే 31వరకు రెండో డోసే

May 14 2021 1:50 AM | Updated on May 14 2021 8:56 AM

Vaccine Shortage Second Dose Up To 31 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ లో భాగంగా ఈనెల 31 వరకు రెండో డోసు పంపిణీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సిన్‌  కొరత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, తొలిడోసు వ్యాక్సిన్‌  తీసుకోవాలనుకునే వారు కొంత కాలం వేచిచూడాల్సిందేనని స్పష్టం చేశారు. టీకా కోటా సంతృప్తికరంగా వచ్చిన వెంటనే మొదటి డోసు పంపిణీ మొదలుపెడతామన్నారు. మే 31వ తేదీ వరకు రాష్ట్రంలో 15 లక్షల మందికి రెండోడోసు వ్యాక్సిన్‌  ఇవ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం తమ వద్ద కేవలం ఒక లక్ష డోసుల టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు.  

గురువారం కోఠిలోని తన కార్యాలయంలో వైద్య విద్య విభాగం సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే లాక్‌డౌన్‌  విధించిందని, ప్రజలు సహకరిస్తేనే దీని ఫలితాలు అందుతాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా గుంపులుగా వస్తే కరోనా వ్యాప్తి అదుపులోకి రాకుండా పోతుందన్నారు. లాక్‌డౌన్‌  ఉన్నప్పటికీ కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి మినహాయింపు ఉంద న్నారు. తగిన ధ్రువపత్రాలు, ఆధారాలు చూపి పోలీసుల అనుమతి పొందవచ్చన్నారు.

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ను ఆరు నుంచి 8 వారాల మధ్య, కోవాగ్జిన్‌  4 నుంచి 6 వారాల మధ్య రెండో డోసు కింద తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల కొరత లేదన్నారు. ప్రస్తుతం 5,783 ఆక్సిజన్‌  పడకలు, 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని, ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్‌ ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ఆక్సిజన్, రెమిడెసివిర్‌ల గురించి రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆక్సిజన్‌  మానిటరింగ్‌ టీమ్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement