TS High Court Key Comments On Dharmapuri Strong Room Lock Missing, Details Inside - Sakshi
Sakshi News home page

ధర్మపురి: స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాల గల్లంతుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Apr 12 2023 3:37 PM | Updated on Apr 12 2023 4:20 PM

TS High Court Key comments Over Dharmapuri strong Room Lock Missing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ కరీంనగర్‌: ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాల గల్లంతు వివాదంపై తెలంగాణలో ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాల గల్లంతుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది. ఈ సందర్బంగా తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. 2018లో లక్ష్మణ్‌ కుమార్‌(కాంగ్రెస్‌)పై 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్‌ గెలుపొందారు. కాగా, కొప్పుల విజయంపై లక్ష్మణ్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

మరోవైపు.. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించారు. దీంతో, మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement